మట్టా దయానంద్ ను పరామర్శించిన శ్రీనివాసరావు*

Published: Thursday March 02, 2023
తల్లాడ, మార్చి 1 (ప్రజా పాలన న్యూస్):
సత్తుపల్లి ఆశా స్వచ్ఛంద సేవా సొసైటీ చైర్మన్ డాక్టర్ మట్టా దయానంద్ ను విజయ్ స్వచ్ఛంద సేవా సొసైటీ చైర్మన్ దొబ్బల శ్రీనివాసరావు పరామర్శించారు. బుధవారం సత్తుపల్లిలోని ఆయన స్వగృహంలో దయానంద్ ను ఆయన పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, నియోజకవర్గ ప్రజలందరికీ సేవా కార్యక్రమాలు చేపట్టాలని శ్రీనివాసరావు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎగ్జిక్యూటివ్ మెంబర్ షేక్. బాబు సాహెబ్, స్థానికులు ఉన్నారు.