మధిర లో లోఘనంగా కాశయ్యగారి సంతాప సభ.
Published: Monday July 05, 2021
"మధిర ప్రజాపాలన ప్రతినిధి నాలుగో తేదీ మున్సిపాలిటీకాశయ్య గొప్ప దేశ భక్తుడు, ఉన్నత విలువలు గల రాజకీయ వేత్త, వారి మరణం సమాజానికి తీరని లోటు" అని మధిర మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లతమధిర రిక్రియేషన్ క్లబ్ లో ఏర్పాటు చేయబడిన సంతాప సభలో, వారి సేవలను, ఔన్నత్యాన్ని కొని యాడారు.కాశయ్య గారి సన్నిహితులు, పుతుంబాక కృష్ణ ప్రసాద్, కాలం వీరభద్రరావు, పారుపల్లి వెంకటేశ్వరరావు వగైరాలు ఏర్పాటు చేసిన ఈ సంతాప సభకు, మాధవరపు నాగేశ్వరరావు నిర్వాహకులుగా వ్యవహరించుటయే కాక, వివిధ కార్యక్రమాల్లో, లోగా కాశయ్య గారు పాల్గొన్న, చక్కని ఛాయాచిత్ర ప్రదర్శనతో, ఆహ్లాద పరిచారు. ఈ సభలో, రంగిసెట్టి కోటేశ్వర రావు, చిత్తారు నాగేశ్వరరావు, బొమ్మెర రామమూర్తి, డాక్టర్ రామనాథం, మల్లు నందిని, కట్టా గాంధీ, దుగ్గినెని రామనాథం, జమలాపురం గోపాలకిషన్రావు, బాబ్ల, చెరుకూరి నాగార్జున, గడ్డం శ్రీనివాసరావు, కరివేద వెంకటేశ్వరరావు, అంజన్ బాబు, యిరుకుళ్ళ నరసింహారావు మరియు గురుదక్షిణ ఫౌండేషన్ బాధ్యులు చావా సత్యనారాయణ ప్రసాద్, ఎం.సత్యనారాయణ, రామకృష్ణ, దుగ్గినేని శ్రీనివాసరావు, చంద్రశేఖర్ గార్లు మరియు యితర అభిమానులు పాల్గొని ప్రసంగించారు. సభానంతరం, ఆహూతులకు, కాకతీయ కమ్మ సేవా సంఘం వారు భోజనాలు ఏర్పాటుచేశారు.
Share this on your social network: