మెట్ పల్లి పట్టణంలో నిర్మించిన బేస్ మెట్లు అక్రమంగా తొలగించి డ్రైనేజి నిర్మాణం చేస్తున్న క

Published: Friday February 18, 2022

కోరుట్ల, ఫిబ్రవరి 17 (ప్రజాపాలన ప్రతినిధి): కోరుట్ల నియోజకవర్గం మెట్ పల్లి పట్టణంలోని ఆరో వార్డుకు చెందిన బాధితులు మాట్లాడుతూ నా పేరు సల్లం నదియా నా భర్త సల్లం చిరంజీవి మా ఊరు కథలాపూర్ మండలం పోతారం గ్రామం మెట్ పల్లి పట్టణంలో గత 30 సంవత్సరాల నుంచి మాకు స్థలం ఉంది దానికి చుట్టు బేస్మెంట్ కూడా నిర్మించాం ఇప్పుడు కౌన్సిలర్ మా మీద పగ బట్టి అక్రమంగా మా బేస్ మెంట్ ను తొలగించి డ్రైనేజీ నిర్మిస్తానని ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు న్యాయం చేయాలని కోరుతున్నాం మా స్థలంలో ఉన్న బేస్ మెంట్ ను తొలగించి అక్రమంగా డ్రైనేజీ నిర్మించాలని స్థానిక కౌన్సిలర్ బంగారి కాళ్ల కిషోర్ ప్రయత్నిస్తున్నారు ఇదేమి అని అడుగుతే మాకు ఎమ్మెల్యే అండ ఉంది ఏం చేసుకుంటారో చేసుకోండి అని మమ్మల్ని బెదిరింపులకు పాల్పడుతున్నారని దయచేసి మాకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారిని కోరుతున్నాం అని అన్నారు మాకు న్యాయం జరగకపోతే మరణమే శరణ్యంగా అనిపిస్తుంది అని ఆవేదన వ్యక్తం చేశారు.