మధిరలో రోడ్డు ప్రమాదంముగ్గురికి తీవ్రగాయాలు

Published: Wednesday May 18, 2022
మధిర మే 17 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం నాడు ఫ్లై ఓవర్ బ్రిడ్జి పై పట్టణంలో మంగళవారం రోడ్డు ప్రమాదం స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలో వంతెన పైన కారు- బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.