కరోనా టికా ప్రతి ఒక్కరూ వేయించుకోవాలి
Published: Tuesday April 20, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల పరిధిలోని మాందాపురం గ్రామంలో సోమవారం గ్రామ ప్రజలకు కరోణా టీకా వేసే కార్యక్రమం సర్పంచ్ సొలిపురం సాగర్ రెడ్డి కరోనా టీకా వేయించుకుని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో 45 సంవత్సరాలు నిండిన ప్రతీ వారు కరోణా టీకా వేయించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ సత్యవతి, ఏ.ఎన్.ఎమ్.నాగమణి, ఆరోగ్యమిత్ర మహేష్, ఉపసర్పంచి స్వామి, వార్డుసభ్యులు లావణ్య పద్మ, పంచాయతీ కార్యదర్శి లింగస్వామి, ఆశ కార్యకర్త సవీత, గ్రామపంచాయతీ సిబ్బంది రమేష్ మల్లేష్, వి.ఆర్.ఏ. మల్లేష్, వి.బి.కే.సంతోష, గ్రామస్తులు పాల్గొన్నారు
Share this on your social network: