ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం

Published: Wednesday June 09, 2021
కోరుట్ల, జూన్ 08, (ప్రజాపాలన ప్రతినిధి) : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ 18 సంవత్సరాల వయస్సు దాటిన ప్రతి భారతీయునికి ఈ నెల 21వ తేదీ నుండి ఉచితంగా టీకా ఇవ్వబడుతుందని, అలాగే దీపావళి పండగ వరకు దేశంలోని 80 కోట్లకు పైగా ప్రజలకు ఉచితంగా నిత్యావసర (రేషన్) వస్తువులు ఉచితంగా అందిస్తామని చెప్పారు. పేదవారికి మేలు చేసే ఇంతగొప్ప కార్యానికి శ్రీకారం చుట్టిన మోదీ గారికి కృతజ్ఞతగా మంగళవారం రోజున కోరుట్ల మండలం జోగన్ పల్లి గ్రామంలో నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రదాన కార్యదర్శి మధు గౌడ్, జిల్లా ఐటీ సెల్ కోర్ కమిటీ మెంబర్ భూమి వినోద్, మరియు కార్యకర్తలు, సురేష్, రంజీత్, అంజయ్య, పావన్ తదితరులు పాల్గొన్నారు