రెండో డోస్ టీకా తీసుకున్న నియోజకవర్గం బిజెపి ఇన్చార్జి

Published: Friday April 23, 2021
బాలపూర్, ఏప్రిల్ 22, ప్రజాపాలన ప్రతినిధి : వాక్సిన్ తోనే మహమ్మారి కరోనా అంతం, రెండో డోస్ తీసుకున్న అందెల శ్రీరాములు దంపతులు, కుటుంబ సమేతంగా వ్యాక్సిన్ తీసుకున్న బీజేపీ నేత మహేశ్వరం నియోజకవర్గం బిజెపి ఇంచార్జి అందేల కోవిడ్ - 19 మహమ్మారి అంతానికి ప్రధాని నరేంద్రమోడీ ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెల శ్రీరాములు యాదవ్. గురువారం నాడు  రెండో డోస్ కోవిషిల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ప్రముఖ కాకతీయ ఆసుపత్రి వైద్యులు హరి ప్రకాష్ ఆధ్వర్యంలో కుటుంబ సమేతంగా టీకా తీసుకున్నారు. ఈ సందర్భంగా అందెల మాట్లాడుతూ... వ్యాక్సినేషన్ దేశవ్యాప్తంగా కొనసాగుతున్నందున్న ప్రతీ ఒక్కరూ తీసుకోవాలన్నారు. కరోనా వైరస్ పై పోరాడేది ఒక్క వ్యాక్సిన్ అన్నారు. కోవిడ్ బారిన పడకుండా ప్రతీ ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు తప్పకుండా ధరించాలని కోరారు. శానిటైజర్లు వాడి శుభ్రత పాటించాలని విజ్ఞప్తి చేశారు శ్రీరాములు యాదవ్. వైరస్ ఉద్దృతి ఎక్కువగా ఉన్నందున వల్ల అవసరమైతేనే బయటకు రావాలని  అందెల శ్రీరాములు యాదవ్ ఆన్నారు.