కరోనాతో మరొ మహిళ మృతి
Published: Wednesday May 05, 2021
బెల్లంపల్లి, మే 4, ప్రజాపాలన ప్రతినిధి : కరోనా మహమ్మారి అభం శుభం తెలియని మరో మహిళను పొట్టన పెట్టుకుంది. బెల్లంపల్లిలో నివాసముంటూ బెజ్జూర్ ఎంపీడీవో గా విధులు నిర్వహిస్తున్న డబిల్పురం రాజేందర్ భార్య రాజేశ్వరి (45) కరోనాతో కన్నుమూసింది, గత పది రోజుల క్రితం కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్లోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మరణించింది, ఆమె మరణవార్తతో నివాసం ఉంటున్న బెల్లంపల్లి లో విషాద చాయలు అలుముకున్నాయి.
Share this on your social network: