పదవ రోజుకు చేరిన ఎల్ ఐ సి ఏజెంట్ల ధర్నా
Published: Saturday September 17, 2022
జగిత్యాల, సెప్టెంబర్ 16 ( ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల బ్రాంచి లో జీవిత బీమా సంస్థ లో లియాఫీ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున పదవ రోజున ఒక గంట సేపు మధ్యాహ్నం ధర్నా నిర్వహించారు. ఏజెంట్ల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని ఐ ఆర్ డి చైర్మన్ మొండి వైకరి ని నినాదాలు చేస్తూ, ప్లై కార్డులను చూపుతూ ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో బ్రాంచి అధ్యక్షుడు ఏనుగుర్తి వెంకటస్వామి, ప్రధాన కార్యదర్శి పాదం ఐలయ్య, కోశాధికారి జున్ను మల్లయ్య, డివిజన్ ఉపాధ్యక్షుడు గాదె రమేష్,బ్రాంచి ఉపాధ్యక్షులు ఐలేని రాజేశ్వర్ రెడ్డి, కట్ట నర్సయ్య,100 మంది ఏజెంట్లు పాల్గొన్నారు.
Share this on your social network: