పదవ రోజుకు చేరిన ఎల్ ఐ సి ఏజెంట్ల ధర్నా

Published: Saturday September 17, 2022

జగిత్యాల, సెప్టెంబర్ 16 ( ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల బ్రాంచి లో జీవిత బీమా సంస్థ లో లియాఫీ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున పదవ రోజున ఒక గంట సేపు మధ్యాహ్నం ధర్నా నిర్వహించారు. ఏజెంట్ల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని ఐ ఆర్ డి చైర్మన్ మొండి వైకరి ని నినాదాలు చేస్తూ, ప్లై కార్డులను చూపుతూ ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో బ్రాంచి అధ్యక్షుడు ఏనుగుర్తి వెంకటస్వామి, ప్రధాన కార్యదర్శి పాదం ఐలయ్య, కోశాధికారి జున్ను మల్లయ్య, డివిజన్ ఉపాధ్యక్షుడు గాదె రమేష్,బ్రాంచి ఉపాధ్యక్షులు ఐలేని రాజేశ్వర్ రెడ్డి, కట్ట నర్సయ్య,100 మంది ఏజెంట్లు పాల్గొన్నారు.