ముదిరాజ్ జర్నలిస్టులు, సమ్మేళనానికి తరలిరండి

Published: Thursday September 15, 2022
బెల్లంపల్లి సెప్టెంబర్ 14 ప్రజా పాలన ప్రతినిధి: 
 
ఈ నెల 18న సికింద్రాబాద్ లోని బోయగూడ ముదిరాజు భవన్ లో నిర్వహించే  ముదిరాజ్ జర్నలిస్టుల సమ్మేళనానికి, మంచిర్యాల జిల్లాలోని ముదిరాజ్ జర్నలిస్టులందరూ తరలిరావాలని జిల్లా  ఇంచార్జ్ డి, భాస్కర్ ముదిరాజ్, బుధవారం ఒక  లో తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకతీతంగా నిర్వహించే బోయే ఈ సమావేశంలో ముదిరాజు జర్నలిస్టుల భవిష్యత్తు ప్రణాళిక, తదితర అంశాలపై చర్చించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి ముదిరాజు జర్నలిస్టు సోదరులందరూ  హాజరై విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ముఖ్య అతిథులుగా హైదరాబాద్ పట్టణంలోని సీనియర్ ముదిరాజు జర్నలిస్టులు,  ముదిరాజ్ నాయకులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ముదిరాజ్, ఎమ్మెల్సీ బండ ప్రకాష్ ముదిరాజ్, తదితర నాయకులు హాజరవుతున్నందున ప్రతి ముదిరాజ్  జర్నలిస్టు సోదరులు హాజరై సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.