చదువుకున్న పాఠశాలకు సాయం చేయడం చాలా సంతోషంగా ఉంది. రిత్విక్ జన్మదిన సందర్భంగా విద్యార్థులక

Published: Friday November 04, 2022
చేవెళ్ల నవంబర్ 3 (ప్రజాపాలన):

జన్మదినం సందర్బంగా విద్యార్థులకు పుస్తకాల పంపిణి
చేవెళ్ల మండలంలోని కందవాడ ప్రభుత్వ పాఠశాలలో అదే గ్రామానికి చెందిన రాయిని శ్రీనివాస్ అనే వ్యక్తి తన కుమారుడు రాయిని రిత్విక్ రెండవ జన్మదినం సందర్బంగా విద్యార్థులందరికి నోట్ బుక్ లు,విద్యార్థుల చదువుకు అవసరమైన సామాగ్రిని అందజేసి అందరికి ఆదర్శంగా నిలిచారు.
ఈ సందర్బంగా రాయిని శ్రీనివాస్ మాట్లాడుతూ..
నా చిన్ననాటి ప్రభుత్వ పాఠశాలకు తోచిన మేర సహాయం చేయడం సంతోషంగా ఉందన్నారు.ప్రతి ఒక్కరూ తాము చదువుకున్న పాఠశాలను కాపాడుకోవటానికి ముందుకు రావాలన్నారు.అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ సునీల్ కుమార్ మాట్లాడుతూ.. హెచ్ ఎండీఏ విజిలెన్స్ పోలీస్ కానిస్టేబుల్ గా శ్రీనివాస్ విధులు నిర్వహిస్తూ తాను చదువుకున్న పాఠశాలకు  రుణపడి ఉండాలనే ఆలోచన రావటం హర్షించదగ్గ విషయమని ఆయనను అభినందించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శేరి అరుంధతి,ఎస్ఎంసి చైర్మన్ ఎలీషా,వార్డు మెంబర్ మోసిన్,ఉపాధ్యాయులు,గ్రామస్తులు శేరి సాయి రెడ్డి,బండ లక్ష్మణ్,సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.