పాత్రికేయునికి మాజీ ఎంపీ పొంగులేటి ఆర్థిక సహాయం

Published: Thursday June 10, 2021
ఖమ్మం, జూన్ 9 (ప్రజాపాలన ప్రతినిధి) : ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం చిన్నగోపతి గ్రామానికి చెందిన బి. సురేష్ అతని కుటుంబ సభ్యులు ఇటీవల కరోనా సోకి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. స్థానిక నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంటనే స్పందించి వారిని ఫోన్లో పరామర్శించి, మనోధైర్యం కల్పించి, 10 వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఖమ్మంలోని తన క్యాంప్ కార్యాలయంలో కార్యాలయ ఇంచార్జి తుంబూరు దయాకర్ రెడ్డి ద్వారా బుధవారం నగదును అందజేశారు. ఈ సందర్భంగా పాత్రికేయుడు సురేష్ మాట్లాడుతూ.. కష్ట కాలంలో ఆర్థిక సహాయం అందజేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.