కరెంట్ బిల్లులకు వ్యతిరేకంగా బిజెపి ధర్నా
Published: Wednesday January 25, 2023
శంకరపట్నం జనవరి 21 ప్రజాపాలన రిపోర్టర్:
శంకరపట్నం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై శనివారం బిజెపి మండలాధ్యక్షుడు ఏనుగుల అనిల్ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. విద్యుత్ వినియోగదారులకు విధించే బిల్లులో ఏ సి డి అదనపు చార్జీలను వేయడం వలన ప్రజలకు విద్యుత్ బిల్లుల భారం అధికమవుతుందని, వెంటనే అదనపు చార్జిలను ఎత్తివేయాలని వారు నినదించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు మాడ వెంకట్ రెడ్డి, మండల అధ్యక్షుడు అనిల్, మండల ప్రధాన కార్యదర్శి దాసారపు నరేందర్, బిజెపి వివిధ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
శంకరపట్నం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై శనివారం బిజెపి మండలాధ్యక్షుడు ఏనుగుల అనిల్ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. విద్యుత్ వినియోగదారులకు విధించే బిల్లులో ఏ సి డి అదనపు చార్జీలను వేయడం వలన ప్రజలకు విద్యుత్ బిల్లుల భారం అధికమవుతుందని, వెంటనే అదనపు చార్జిలను ఎత్తివేయాలని వారు నినదించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు మాడ వెంకట్ రెడ్డి, మండల అధ్యక్షుడు అనిల్, మండల ప్రధాన కార్యదర్శి దాసారపు నరేందర్, బిజెపి వివిధ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: