కరెంట్ బిల్లులకు వ్యతిరేకంగా బిజెపి ధర్నా

Published: Wednesday January 25, 2023
శంకరపట్నం జనవరి 21 ప్రజాపాలన రిపోర్టర్:

శంకరపట్నం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై శనివారం బిజెపి మండలాధ్యక్షుడు ఏనుగుల అనిల్ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. విద్యుత్ వినియోగదారులకు విధించే బిల్లులో ఏ సి డి అదనపు చార్జీలను వేయడం వలన ప్రజలకు విద్యుత్ బిల్లుల భారం అధికమవుతుందని, వెంటనే అదనపు చార్జిలను ఎత్తివేయాలని వారు నినదించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు మాడ వెంకట్ రెడ్డి, మండల అధ్యక్షుడు అనిల్, మండల ప్రధాన కార్యదర్శి దాసారపు నరేందర్, బిజెపి వివిధ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు.