ఔట్ సోర్సింగ్ ఉద్యోగి చంద్రయ్య అనుమానాస్పద మృతి

Published: Tuesday March 22, 2022

బీరుపూర్, మార్చి 21 (ప్రజాపాలన ప్రతినిధి): బీరుపూర్ మండల్ రంగసాగర్ గ్రామానికి చెందిన పడిగెల చంద్రయ్య (35) ఆరోగ్య మిత్రగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగస్తుడు ధర్మపురి మండల్ తీగలధర్మారం గ్రామంలో తన అక్క ఇంటికి శుభకార్యానికి వెళ్లగా ఆదివారం రోజున ఉదయం 9 గం:ల సమయంలో బహుర్భుమికి వెళ్లి వస్తానని తన భార్య కళావతితో చెప్పి బయటకు వెళ్ళగా మధ్యాహ్నం రెండు గంటల వరకు కళావతి ఫోన్ చేయగా చంద్రయ్య ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో సొంత గ్రామం రంగసాగర్ వెళ్లాడని అనుకున్న క్రమంలోనే కాసేపటికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి కళావతికి ఫోన్ చేసి చంద్రయ్య చనిపోయాడని చెప్పగా వెంటనే తన బంధువులతో కలిసి ఘటన స్థలానికి చేరుకోగా సంఘటన స్థలంలో చంద్రయ్య మెడపై గాయాలతో కడుపులో కరెంట్ షాక్ తో కాలిన గాయాలతో చనిపోయి ఉన్నాడని అక్కడే కరెంట్ షాక్తో చనిపోతే ఎవరిపై అనుమానం రాకుండ చెరువు ప్రక్కకు తీసుకెల్లి పడేశారని భార్య వాపోయింది. మృతునికి 6 సం. కూతురు వైష్ణవి 8 సం. బాబు సాయి వర్షన్ ఉన్నారని నా పిల్లలకు న్యాయం జరగాలని నా భర్త చావుకు కారణమైన వాళ్లని చట్ట ప్రకారంగా శిక్షించాలని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని ఆమె భోరున విలపించారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.