బెల్లంపల్లిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

Published: Monday December 26, 2022
బెల్లంపల్లి డిసెంబర్ 25 ప్రజా పాలన ప్రతినిధి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో వివిధ చర్చిలలో  క్రిస్మస్ వేడుకలను క్రైస్తవ సోదర, సోదరీమణులు ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. 
పట్టణంలోని సిఎస్ఐ చర్చి ,మరియు సోమగూడెం సమీపంలోని కల్వరీ, చర్చీలను విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు,  సి ఎస్ ఐ చర్చిలో స్థానిక క్రైస్తవ సోదర, సోదరీమణులు హాజరుకాగా, కల్వరి చర్చికీ  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ,  కర్ణాటక, రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
క్రీస్తు జన్మదినం పురస్కరించుకొని  చర్చీకి వచ్చిన భక్తులందరికీ పాస్టర్ ప్రవీణ్  క్రీస్తు సందేశాన్ని వివరించారు. రానున్న రోజుల్లో కరోనా బారి నుంచి ప్రపంచాన్ని క్రీస్తు కాపాడుతారని అన్నారు. 
ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ సుఖ సంతోషాలతో ఉంచుతారని సందేశం ఇచ్చారు. క్రిస్మస్ వేడుకలకు ముఖ్యఅతిథిగ బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం  చిన్నయ్య దంపతులు, మార్కెట్ కమిటీ చైర్మన్ నిరంజన్ గుప్తా, బెల్లంపల్లి పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేతా, కుటుంబ సభ్యులు హాజరైనారు, కల్వరి చర్చి నిర్వాహకులు ముత్తినేని రవి, పట్టణ కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.