గ్రామ అభివృద్ది పనులపై గ్రామ సభ

Published: Tuesday October 12, 2021
కోరుట్ల, అక్టోబర్ 11 (ప్రజాపాలన ప్రతినిధి) : కోరుట్ల మండలంలోని జోగన్ పల్లి గ్రామంలో సోమవారం రోజున గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక జిపిడిపి గ్రామసభ గ్రామ సర్పంచ్ దుంపల నర్సు ఆధ్వర్యంలో నిర్వహిoచారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాబోయే సంవత్సరాల కాలానికి సంబంధించిన అన్ని అంశాల పైన చర్చించడం జరిగిందని, అలాగే గ్రామంలో ఏ పనులు చేయాలి అనే అంశం మీద చర్చించారని, పారిశుద్ధ్యం, నీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ, సిసి రోడ్ల నిర్మాణం, మరియు ప్రజలకు అవసరాల పనుల పైన చర్చించడం జరిగిందని గ్రామ సర్పంచ్ దుంపల నర్సు రాజా నర్సయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బద్దం తిరుపతి రెడ్డి, వార్డు సభ్యులు, గ్రామ కార్యదర్శి హకీమ్, అంగన్వాడీ టీచర్స్, హెల్త్ వర్కర్స్ , వీఆర్ఏలు నరేందర్, సంజీవ్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు