ఎమ్మెల్యే ఆధ్వర్యంలో 10 వ రోజుకు చేరిన భోజన ఏర్పాట్లు

Published: Friday June 04, 2021

బెల్లంపల్లి, జూన్ 3, ప్రజాపాలన ప్రతినిధి : బెల్లంపల్లి పట్టణంలోని కరోనా ఐసోలేషన్ కేంద్రంలో కరోనా బాధిత కుటుంబాలకు ఆహార సదుపాయాల్ని కలిపిస్తున్న ఎమ్మెల్యే. కరోనా బాధిత కుటుంబాలు ఐసోలేషన్ కేంద్రం వద్ద తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గమనించిన స్థానిక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గత పది రోజులుగా ఏర్పాటుచేసిన ఉచిత భోజన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుందని పట్టణ మాలమహానాడు నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం నాడు వారు మాట్లాడుతూ జనహృదయనేత బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బెల్లంపల్లి ఐసోలేషన్ కేంద్రం వద్ద కరోనా బాధితుల కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్న విషయం తెలుసుకుని భోజన సదుపాయాలను కల్పించడం జరుగుతుందని దాన్ని యధావిధిగా కొనసాగిస్తామని వారన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకుడు శ్యామ్, మాలమహానాడు నాయకులు కుంభాల రాజేష్, కుసుమ మధు, తదితరులు పాల్గొన్నారు.