ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 9 ప్రజాపాలన ప్రతినిధి **అనాజ్ పూర్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడు
Published: Friday March 10, 2023
ప్రగతి నివేదన యాత్రలో భాగంగా 46వ రోజు సాయంత్రం యువనేత శ్రీ మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి పాదయాత్రతో అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని అనాజ్ పూర్ గ్రామానికి చేరుకుని, గడపగడపకు తిరిగి కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరించి, కావలసిన అభివృద్ధిని మరియు సమస్యలను అడిగి తెలుసుకున్నారు.గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద నుర్వహించిన సభలో ముఖ్య అతిధులుగా బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి , రాష్ట్ర నాయకులు శ్రీ క్యామ మల్లేష్ గారు పాల్గొన్నారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎస్.సీ కమ్యూనిటి హాల్ నిర్మాణం కోసం 10లక్షల రూపాయలు మంజూరు చేశారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరితో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
Share this on your social network: