ఘనంగా వినోద్ కుమార్ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనోత్సవం
Published: Tuesday September 21, 2021
మేడిపల్లి, సెప్టెంబర్ 20, (ప్రజాపాలన ప్రతినిధి) : పీర్జాదిగూడ న్యూ శ్రీ సాయి నగర్ కాలనీలో నెలకొల్పిన గణేష్ నిమజ్జనోత్సవం ఘనంగా జరిగింది. కంది వినోద్ కుమార్ మిత్ర బృందం పది రోజులపాటు భక్తిశ్రద్ధలతో గణనాథుడి పూజా కార్యక్రమాలు నిత్యం నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేసి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు, మేళతాళాలతో ఆదివారం నాడు పీర్జాదిగూడ శ్రీ సాయి నగర్ కాలనీలో నెలకొల్పిన గణనాథుడి నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. విగ్రహ దాత కంది వినోద్ కుమార్ శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ యాత్రలో కంది వినోద్ కుమార్, మల్లికార్జున, రాజు శ్రీనివాస్, నరేష్ కుమార్, యు.నరేష్, సంతోష్ మహిపాల్ రెడ్డి, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: