పెండింగ్ పనులను పూర్తి చేయాలి

Published: Thursday July 01, 2021
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ జూన్ 30 ప్రజాపాలన బ్యూరో : పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సూచించారు. బుధవారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ మండల పరిధిలోని పులుమద్ది గ్రామాన్ని సర్పంచ్ మాధవరెడ్డి ఆధ్వర్యంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గురువారం పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిల పర్యటన సందర్భంగా వైకుంఠ ధామం, హరితహారం నర్సరీ, పల్లె ప్రకృతి వనం మరియు డంపింగ్ యార్డును సందర్శించారు. రోడ్డుకి ఇరువైపులా వాడిపోయిన మొక్కలను తొలగించి కొత్త మొక్కలను నాటాలన్నారు. పిచ్చి మొక్కలను తొలగించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పౌసుమి బసు, అదనపు కలెక్టర్ చంద్రయ్య, డిపిఓ రిజ్వాన, ఎంపీపీ చంద్రకళ, మిషన్ భగీరథ డిఈ రత్న ప్రసాద్, డిఆర్డిఓ కృష్ణన్, ప్లాంటేషన్ మేనేజర్ సతీష్ రెడ్డి, ఎంపిడిఓ సుభాషిణి, పిఆర్ ఎఈ చాణక్య రెడ్డి, రైతు బంధు అధ్యక్షులు వెంకటయ్య, మైనారిటీ సెల్ అధ్యక్షులు గయాజ్, అధికారులు మరియు నాయకులు పాల్గొన్నారు.