రూ 5లక్షలతో డ్రైనేజీ పనులు ప్రారంభోత్సవం

Published: Friday October 08, 2021
మేడిపల్లి, అక్టోబర్ 07 (ప్రజాపాలన ప్రతినిధి) : బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 9వ డివిజన్ ఈస్ట్ బాలాజీ హిల్స్ కాలనీలో రూ 5 లక్షలతో నిర్మిస్తున్న డ్రైనేజి పనులను స్థానిక కార్పొరేటర్ మోదుగు లావణ్యశేఖర్ రెడ్డితో కలిసి మేయర్ సామల బుచ్చిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో డ్రైనేజ్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. డివిజన్లోని సమస్యలను పరిష్కరిస్తూ, డివిజన్ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దామని కార్పొరేటర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మోదుగు శేఖర్ రెడ్డి, మోదుగు మోహన్ రెడ్డి కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.