రాష్ట్ర స్థాయి 2వ ర్యాంక్ సాధించిన మణిమాల విద్యార్థినికి ప్రజాప్రతినిధుల అభినందనలు...

Published: Wednesday June 29, 2022

మల్లాపూర్, జూన్ 28 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల జిల్లా మల్లాపుర్ మండలం సీరిపూర్ గ్రామానికి చెందిన నూనావత్  మణిమాల ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాల్లో 440 మార్కులకు గాను 436 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయి 2వ ర్యాంకులో నిలవడంతో విద్యార్థినికి, విద్యార్థిని తల్లిదండ్రులు నూనావత్ రాజు హారిక లకు గ్రామ సర్పంచ్ భుక్య గోవింద్ నాయక్, యం.పి.టీ.సి. ఏనుగు రాంరెడ్డి,  ప్రజాప్రతినిధులు శుభాభినందనలు తెలియజేశారు. మణిమాల సిరిపూర్  గ్రామ పేరు ప్రతిష్టలు రాష్ట్ర స్థాయిలో నిలపడం గ్రామానికే గర్వకారణమని, భవిష్యత్తులో మంచి డాక్టర్ పట్టా సాధించి ప్రజలకు వైద్యసేవలందించే స్థాయికి చేరుకుని మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అభిలషించారు.