రోటరీ క్లబ్ ఆఫ్ భువనగిరి నూతన అసిస్టెంట్ గవర్నర్ గా గడ్డం జ్ఞాన ప్రకాశ్ రెడ్డి ఎన్నిక
Published: Tuesday November 23, 2021
యాదాద్రి-భువనగిరి జిల్లా 21 నవంబర్ ప్రజాపాలన ప్రతినిధి : రోటరీ క్లబ్ ఆఫ్ భువనగిరి (3150) అసిస్టెంట్ గవర్నర్ 2022-23 గా గడ్డం జ్ఞాన ప్రకాశ్ రెడ్డి ఎన్నిక అయ్యారు. ఎకనామిక్ కమ్యూనిటీ డెవలప్మెంట్ తెలంగాణ రీజియన్ చైర్మన్, రోటరీ క్లబ్ ఆఫ్ భువనగిరి మాజీ అధ్యక్షుడు సీనియర్ రొటేరియన్ గడ్డం జ్ఞాన ప్రకాశ్ రెడ్డి అసిస్టెంట్ గవర్నర్ గా ఎన్నికయ్యారని తాళ్ళ రాజశేఖర్ రెడ్డి ప్రకటించారు. గుంటూరు లో 'ఆరంభం' పేరుతో జరిగిన రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3150 ప్రీ అసిస్టెంట్ గవర్నర్ ట్రైనింగ్ సదస్సులో తాళ్ళ రాజశేఖర్ రెడ్డి పలువురు 2022-23 అసిస్టెంట్ గవర్నర్ గా ఎన్నికయ్యారని తెలిపారు. నూతన అసిస్టెంట్ గవర్నర్ లకు నియామక పత్రాలను అందజేశారు.నూతనంగా ఎన్నికైన వారికి శిక్షణ తరగతులను నిర్వహించినట్లు తెలిపారు. నూతనంగా ఎన్నికైన అసిస్టెంట్ గవర్నర్ లకు పలువురు శుభాకాంక్షలు అందజేశారు. శుభాకాంక్షలు అందచేసిన వారు తాల్క ట్రస్టు (భరత్ కుమార్ మెమోరియల్ సొసైటీ మాటూరు) సభ్యులు, చైర్మన్ డాక్టర్ ఎంపల్ల బుచ్చిరెడ్డి, వంగేటి సూర్య ప్రకాష్ రెడ్డి, అధ్యక్షుడు మందడి వెంకట్ రెడ్డి, స్నేహితులు బంధువులు మరియు పలువురు రొటేరియన్స్ గడ్డం జ్ఞాన ప్రకాశ్ రెడ్డి కి శుభాకాంక్షలు అందజేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ భువనగిరి 2022-23 నూతన అసిస్టెంట్ గవర్నర్ గా తనను ఎన్నిక చేసినందుకు ఇన్నాళ్లు తన వెన్నుతట్టి ప్రోత్సాహించిన వారందరికీ గడ్డం జ్ఞాన ప్రకాశ్ రెడ్డి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు.
Share this on your social network: