దేవి నవరాత్రి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న కందికంటి అశోక్ కుమార్ గౌడ్ సల్లా రాజిరెడ్డి

Published: Monday October 03, 2022
మేడిపల్లి, అక్టోబర్2 (ప్రజాపాలన ప్రతినిధి)

ఉప్పల్ గాంధీ బొమ్మ వద్ద నవదుర్గ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దుర్గామాత అమ్మవారి మండపం వద్ద ఆదివారం టీడీపీ మల్కాజిగిరి పార్లమెంటు ఇంచార్జ్ కందికంటి అశోక్ కుమార్ గౌడ్ మరియు  కాంగ్రెస్ సీనియర్ నేత సల్లా రాజిరెడ్డి దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నవదుర్గ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు రుద్రగోని రాజ్ కుమార్ గౌడ్, బజారు వేణు గౌడ్, సోమసాని ప్రవీణ్ ముథిరాజ్, బుర్ర శేఖర్ గౌడ్, పల్లె గణేష్ గౌడ్, కృష్ణారెడ్డి, రంగ భాస్కర్ గౌడ్, మీనంపల్లీ మల్లేష్ గౌడ్, పూడూరు కృష్ణారెడ్డి, నిఖిల్ గౌడ్,పునీత్ కుమార్ గౌడ్ తదితరులు  పాల్గొన్నారు.