జనశిక్షణా అధ్వర్యంలో బిర్సాముండా జయంతి

Published: Wednesday November 16, 2022
ఖమ్మం, నవంబర్ 15 (ప్రజాపాలన న్యూస్): జనశిక్షణ సంస్థాన్ ఖమ్మంజిల్లా ఆధ్వర్యంలో మంగళవారం భగవాన్ బిర్సాముండా  జన్మదిన వేడుకలను ఖమ్మం అర్బన్ మండలంలోని జయనగర్ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీ, ఖానాపురం తదితర గ్రామాలలో ఘనంగా నిర్వహించారు. ఆజాది కా అమృత మహోత్సవ కార్యక్రమంలో భాగంగా జనశిక్షణ సంస్థన్ సెంటర్స్ లలో శిక్షణ పొందుతున్న లబ్ధిదారులతో మీటింగ్ ను ఏర్పాటు చేసి భగవాన్ బిర్సా ముండా వంటి గిరిజన నాయకుల వారసత్వం గురించి అలాగే భారతదేశంలో జనజాతీయ కమ్యూనిటీ యొక్క ఇతర గొప్ప వ్యక్తులు, పాడని వీరుల గురించి జ్ఞానోదయం కలిగించుట జరిగింది. స్వాతంత్ర పోరాటంలో జనజాతీయ సహకారం అనే అంశం పై జె యస్ యస్ లబ్ధిదారులకు మధ్య చర్చా పోటీలు నిర్వహించామని జె యస్ యస్ డైరెక్టర్ వై రాధాకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్స్, స్టాఫ్, లబ్ధిదారులు,గ్రామ పంచాయతీ  పెద్దలు పాల్గొన్నారు.