తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం.... --ఎమ్మేల్యే డా.సంజయ్

Published: Monday December 19, 2022

జగిత్యాల, డిసెంబర్ 18 (ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ పట్టణానికి చెందిన కౌన్సిలర్ మ్యాకల కాంతా రావు  అధ్వర్యంలో యూత్ నాయకులు రాజేష్ మరియు 40 మంది యువకులు   ప్రభుత్వ అబివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై బి అర్ ఎస్ పార్టీ లో చేరగా  పార్టీ కండువా కప్పి పార్టీలోకి  ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ ఆహ్వానించినారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కొల శ్రీనివాస్, నాయకులు సురేష్, రాజేందర్,  నాయకులు తదితరులు పాల్గొన్నారు.