ఎస్సారెస్పీ కాలువలో కొట్టుకుపోతున్న గుర్తుతెలియని మృతదేహం

Published: Monday March 13, 2023

మానకొండూరు(శంకరపట్నం) మార్చి 11 ప్రజాపాలన రిపోర్టర్: 

 
 
 
 
కరీంనగర్ జిల్లా దిగువ మానేరు నుండి వరంగల్ జిల్లాకి వెళ్లే ఎస్సార్ఎస్పీ కెనాల్ లో శనివారం ఉదయం గట్టు  దుద్దెనపల్లి గ్రామ శివారులోలోని కెనాల్ లో తెల్ల చొక్కా ధరించిన ఓ మధ్య వయస్కుడి మృతదేహం బోర్లా పడి కొట్టుకుపోతుంది. కెనాల్ లో నీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో మృతదేహాన్ని తీయడానికి వీలు లేకుండా కొట్టుకుపోతున్నది.  ఈ కెనాల్ తిమ్మాపూర్ మండలంలోని పలు గ్రామాలు, తర్వాత శంకరపట్నం మండలంలోని ఇప్పలపల్లి కరీంపేట్ అంబల్పూర్ కేశపట్నం గ్రామాల మీదుగా వెళ్తుంది కాబట్టి నీటి ఉదృతీ తగ్గితే  ఉప దేహాన్ని అడ్డుకు చేర్చే ప్రయత్నం చేయవచ్చు అని చర్చించుకుంటున్నారు. పోలంపల్లి గ్రామ శివారులో మృతదేహాన్ని ఒడ్డుకు చెర్చినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సిఉoది.