శాంతిఖని గనినీ సందర్శించిన రక్షణ కమిటీ

Published: Friday December 23, 2022
బెల్లంపల్లి డిసెంబర్ 22 ప్రజా పాలన ప్రతినిధి: మందమర్రి డివిజన్లోని, శాంతిఖని బొగ్గు గనిని గురువారం రక్షణ కమిటీ బృందం సందర్శించారని ప్రాజెక్టు అధికారి ఆర్ విజయ్ ప్రసాద్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు, భూగర్భ గని లోని 
బీఎం డిస్ట్రిక్ట్ మరియు బెల్ట్ దారులను  పర్యవేక్షించారని, అనంతరం  సమావేశమై గనిలో రక్షణ కోసం తీసుకోవల్సిన జాగ్రత్తలపై చర్చించి పలు సూచనలు చేశారని ఆయన తెలిపారు.
 ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు అధికారి ఆర్.విజయ ప్రసాద్, మేనేజర్ సంజయ్ కుమార్ సిన్హా, రక్షణ అధికారి పి.రాజు, పిట్ ఇంజనీర్ రాంబాబు, ఇంజనీర్లు రాంసాగర్, ప్రవీణ్, టీబీజీకెఎస్ పిట్ కార్యదర్శి దాసరి శ్రీనివాస్, ఏఐటీయుసి పిట్ సెక్రటరీ దాసరి తిరుపతి గౌడ్ మరియు సేఫ్టీ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.