చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణలో పాల్గొన్న పాల్వాయి స్రవంతి
Published: Tuesday September 27, 2022
చౌటుప్పల్ సెప్టెంబర్ 26 (ప్రజాపాలన ప్రతినిధి) :తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా స్వాములవారి లింగోటం గ్రామంలో విగ్రహావిష్కరణ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మునుగోడు ఉపఎన్నిక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి హాజరై విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు చాకలి ఐలమ్మ పోరాటం నేటి యువతకు ఆదర్శం అని రామచంద్రారెడ్డిని ఎదిరించిన దీరవనిత అని కొనియాడారు అలాగే గ్రామంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండపాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేయించారు మార్గమధ్యంలో ప్రతిష్ట కంపెనీ వద్ద కార్మికులు ధర్నా చేస్తున్న విషయం తెలుసుకొని వారి సమస్యల సాధనకై వారు చేస్తున్న పోరాటానికి మద్దతుగా వారు కూడా ధర్నాలో పాల్గొన్నారు వారి వెంట లింగోటం గ్రామ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు
Share this on your social network: