ఘనంగా కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
Published: Wednesday September 28, 2022
కోరుట్ల, సెప్టెంబర్ 27 (ప్రజాపాలన ప్రతినిధి):
కోరుట్ల మండలం లోని మాదాపూర్ గ్రామంలో స్వాతంత్ర్య సమరయోధుడు, తొలితరం తెలంగాణ ఉద్యమకారులు, బడుగు బలహీనవర్గాల స్ఫూర్తి ప్రదాత కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘనంగా నివాళులు అర్పించిన జడ్పిటిసి దారిశెట్టి లావణ్య రాజేష్ మరియు జిల్లా సర్పంచ్ ఫోరం అధ్యక్షులు, మాదాపూర్ స్థానిక సర్పంచ్ దారిశెట్టి రాజేష్ .ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ స్వరాష్ట్రం కోసం పరితపించిన తెలంగాణ వాది, నిబద్ధత కలిగిన రాజకీయ వేత్త , స్వాతంత్ర్య సమరయోధులు, కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఉప సర్పంచ్ మల్లారెడ్డి, ఎంపీటీసీ కృష్ణారెడ్డి , పిఎసిఎస్ చైర్మన్ గడ్డం ఆదిరెడ్డి, వివిధ సంఘం సభ్యులు,యూత్ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Share this on your social network: