ఘనంగా వెల్గటూర్ మండలములో రైతు బంధు సంబరాలు.

Published: Tuesday January 11, 2022
వెల్గటూర్, జనవరి 10 (ప్రజాపాలన ప్రతినిధి)  :  కొన్ని సంవత్సరాల తెలంగాణ రైతులు పడుతున్న కష్టాలు తీర్చిన సీఎం కేసీఆర్ ధర్మపురి నియోజకవర్గ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సహకారంతో వెల్గటూర్ మండలంలో రైతుబంధు వేడుకలు ఘనంగా నిర్వహించి సోమవారం రోజు రైతు వేదికల వద్ద వేడుకలను ఆయా ప్రాంతాల గ్రామాల రైతులు సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. మండలంలోని గుల్లకోట రైతు వేదిక వద్ద క్లస్టర్ లకు సంబంధించిన రైతులు సర్పంచులు ఎంపీటీసీలు ట్రాక్టర్ ర్యాలీతో సంబరాలు జరుపుకున్నారు. ఎం.పి.పి.కనమల్ల లక్ష్మీ లింగయ్య, జెడ్.పి.టి.సి.బి.సుధారాణి రామస్వామి, గ్రామ సర్పంచ్ పొన్నం స్వరూప తిరుపతి గౌడ్, తె.రా.స మండల శాఖ అధ్యక్ష కార్యదర్శులు సింహాచలం జగన్, జూపాక కుమార్, సహకార సంఘం అధ్యక్షులు గూడ రామ్ రెడ్డి, గోలి రత్నాకర్, ఎం.డి రియాజ్,కోటిలింగాల దేవస్థానం చైర్మన్ పదిరె నారాయణరావు, ఎం.పీ.టీ.సీ శ్రీజ, తె.రా.స మాజీ అధ్యక్షులు చల్లూరి రామచంద్ర గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు ఎలెటి కృష్ణారెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షులు కొప్పుల సురేష్, సిగిరి ఆనందం, పడిద నారాయణ, పడిదం వెంకటేష్,మహిళ మండల శాఖ అధ్యక్షురాలు సింగిరెడ్డి సింధుజ రెడ్డి, గాగి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, లచ్చిరెడ్డి, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.