ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు

Published: Saturday April 15, 2023
బోనకల్ ,ఏప్రిల్ 14 ప్రజా పాలన ప్రతినిధి:ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు అని జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు. గురువారం నాడు సాయంత్రం బోనకల్ మండలం, రావినూతల గ్రామంలో జరిగిన ఇఫ్తార్ విందు లో పాల్గొన్న ఆయన తనతో పాటు ఆశీనులైన పలువురికి ఇఫ్తార్ విందు అందించి రోజా ను విరమింపజేశారు. అనంతరం వారితో కలిసి ఇఫ్తార్ విందు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఏడాది లాగే ఈ ఏడాది కూడా ఇఫ్తార్ విందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. బీఆర్ఎస్ పదేళ్ల కాలం లో 12000 వేల కోట్ల రూపాయలను ముస్లింల సంక్షేమం, అభివృద్ధికి ఖర్చు చేసిందని తెలిపారు. అన్ని మతాలు చెప్పేది ఒక్కటేనని, మనుషులంతా సోదర భావంతో ఉండాలన్నారు. ముస్లిం సోదరులు అందరికీ రంజాన్ మాసపు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ముస్లిం పెద్దలు, పాల్గొన్నారు.