క్రీడలు మానసికోల్లాన్ని ఇస్తుంది

Published: Monday March 28, 2022
మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్
వికారాబాద్ బ్యూరో 27 మార్చి ప్రజాపాలన : క్రీడలు మానసికోల్లాసంతో పాటు శారీరక దృఢత్వం కలుగుతుందని మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ అన్నారు. ఆదివారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 6వ వార్డు వెంకటాపూర్ తండాలో స్థానిక కౌన్సిలర్ చందర్ నాయక్ ఆధ్వర్యంలో సేవాలాల్ మహారాజ్ యూత్ అసోసియేషన్ 3వ వార్షికోత్సవం సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్ ను వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ ఆటలు మానసిక ఉల్లాసాన్ని ఇవ్వడంతోపాటు, శారీరక దారుడ్యాన్ని పెంచుకోవడానికి కూడా ఉపయోగపడతాయన్నారు. సమయం దొరికినప్పుడల్లా ప్రతి ఒక్కరూ ఆటలకు ప్రాధాన్యత ఇవ్వాలి అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్, అనంతగిరి టీబి ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ దశరథ్, పిపి రామ్ బకస్, ఎస్ఐ సురేష్, మహిపాల్, కాలనీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.