మరో పదేళ్లు కెసిఆర్ కొనసాగాలి

Published: Tuesday October 26, 2021
బాలాపూర్, అక్టోబర్ 25, ప్రజాపాలన (ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, మరో పది సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా కెసిఆర్ పాలన అందించాలని మీర్ పేట్ డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు. టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన జన ఉదయ నేత కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. తీగల విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ..... తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అపర భగీరధుడు నిరుపేదల పెన్నిది దివ్యాంగుల దివ్య నేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర అధ్యక్షుడిగామరొకసారి ఎన్నిక కావడం గర్వకారణం రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమ దిశగా తీసుకొని వెడుతూ రాష్ట్రానికి ఒక దిశ నిర్దేశిస్తున్న ఆయన పాలన మరికొన్ని సంవత్సరాలు అనుభవించాలని నేను కోరుకుంటున్నాను, అలుపెరుగని ఉద్యమ ప్రస్థానం కెసిఆర్ సొంతం అభివృద్ధి సంక్షేమం ఆయన లక్ష్యం తెలంగాణ రాష్ట్రంలోనే పోరాట తత్వం ఉంది అసామాన్య త్యాగాల వారధి రథసారథి కావడం కార్యకర్తలు అందరికీ గర్వకారణమైన విషయమే అన్నారు. లక్ష్యంవైపు అస్త్రాన్ని సంధించి నాడే కెసిఆర్ విజయం తథ్యం అయింది. తెలంగాణ రాష్ట్రం సాధ్యం కాదు అందుకు కేంద్రం అంగీకరించదుని అన్న నోళ్ళు మూతపడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు, కార్యకర్తలను పార్టీ కుటుంబ సభ్యులుగా చూసుకుంటూ వారి కష్టాలతో మమేకం అవుతూ ఉన్న కేసీఆర్ గెలుపు కార్యకర్తలందరి గెలుపే అన్నారు. మన సీఎం బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలు రూపొందించి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సామాజిక వర్గాలకు అధికార పదవులు కట్టబెట్టడం లో కెసిఆర్ అందెవేసిన చెయ్యి కేసీఆర్. మరో పది సంవత్సరాలు రాష్ట్ర అధ్యక్షులుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పది కాలాలు పనిచేస్తే కార్యకర్తలకు మరింత బలం చేకూరుతుందని ఆయన రాష్ట్ర అధ్యక్షుడు కావడం పట్ల యావత్ తెలంగాణ ప్రజల హృదయపూర్వక  ధన్యవాదాలు తెలుపుతారని మీర్ పేట్ డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి వెల్లడించారు.