ప్రజల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం

Published: Wednesday February 16, 2022
మాజీ మేయర్ బొంతు రాంమోహన్
మేడిపల్లి, ఫిబ్రవరి 15 (ప్రజాపాలన ప్రతినిధి) : ప్రజల సంక్షేమ, అభివృద్ధే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారని గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రాంమోహన్ పేర్కొన్నారు. ఈ నెల 17వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా 3 రోజులు పాటు సామాజిక కార్యక్రమాలు చేపట్టాలన్న టీఆర్ఎస్ పార్టీ  వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఅర్ పిలుపు మేరకు మాజీ కార్పొరేటర్ గంధం జోష్ణ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో రామంతాపూర్ ప్రగతినగర్ డాన్ బాస్కో పాఠశాలలో అనాధ పిల్లలకు అన్నదాన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనాధ పిల్లలతో కేక్ కట్ చేయించి, కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాప్రా కార్పొరేటర్ స్వర్ణరాజ్, మాజీ కార్పొరేటర్లు గొల్లూరి అంజన్న, టీఆర్ఎస్ నాయకులు హన్మంత్ రెడ్డి, సదానంద్, ఇంద్రసేనా రెడ్డి, మధుసూదన్ రెడ్డి, కొప్పు నర్సింగ్ రావు, జగదీష్, శ్రీనివాస్ రెడ్డి, చాప లక్శ్మి, లక్ష్మీ, శంకర్, సమీర్, రమేష్, మనీష్, శ్రీనివాస్, మహేందర్, రాంచంద్రచారి, ప్రశాంత్, బొసాని పవన్, నందు, రఘు, మధు, రవి, అనంద్, రాజు, గొపి చారి, తదితరులు పాల్గొన్నారు.