జూనియర్ సివిల్ జడ్జిగా నియమితులైన ఉమర్ ని సన్మానించిన మాజీ ఎమ్మెల్యే టిఆర్ఆర్

Published: Tuesday August 03, 2021
వికారాబాద్, ఆగస్టు 02, ప్రజాపాలన ప్రతినిధి : పరిగిలోని తన నివాసంలో వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలవడానికి వొచ్చిన ఉమర్ ని మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సన్మానించి, స్వీట్ తినిపించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. విద్యా అన్నది ఒక వ్యక్తికి బలమైన ఆయుధం, దాన్ని మించిన శక్తి ఈ ప్రపంచం లో ఏది లేదు అని వ్యక్తిని క్రింది స్థాయి నుంచి ఎక్కడి కైనా తీసుకువెళ్తుంది అన్నదానికి ప్రత్యక్ష ఉదాహారణ ఉమర్ అని అన్నారు. ఈ సందర్బంగా ఉమర్ ను మన ప్రాంతం యువత ఆదర్శంగా తీసుకొని విద్య పైన దృష్టి పెట్టి చదివినప్పుడే మనం ఏదైనా సాదించవొచ్చు అన్నారు. దోమ ప్రభుత్వ పాఠశాలలో, పరిగి ప్రభుత్వ కాలేజ్ లో చదివి పట్టుదలతో ఈ స్థాయికి రావడం అభినందనియాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ ఆనంద్ గౌడ్, వెంకట్ రెడ్డి, పరిగి పట్టణ పార్టీ అధ్యక్షులు ఎర్రగడ్డ పల్లి కృష్ణ, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్, మూజుబుర్ రహేమాన్, దోమ మండల అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి,కౌన్సిలర్లు. శ్రీనివాస్, శబ్బేనూర్ రియాజ్, మల్లేష్, సర్పంచ్ అశోక్ రెడ్డి, సర్వర్, అక్బర్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.