వ్యవసాయ పరికరాల అవగాహన సదస్సు..

Published: Tuesday July 05, 2022
పాలేరు జూలై 4 ప్రజా పాలన ప్రతినిధి
 ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంచెరువుమాదారం రైతువేది నందు మండలస్థాయి. దళిత బంధు లబ్దిదారులకు వ్యవస్థాయి పరికరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో  వ్యవసాయ అధికారి ఏ డి ఏ.విజయచంద్ర కూపమంచి  మాట్లాడు తూ వ్యవసాయ పరికరాల యూనిట్లు అయిన పరిణిత మిషన్, వరి గడ్డి కట్టే యంత్రం, ట్రాక్టర్ మరియు పరికరాలు మరియు డ్రోన్ వంటి పిచికారి యంత్రాలు గురించి - వివరించినారు. ముఖ్యంగా వ్యవసాయంలో యంత్రాల వినియోగం పెరిగిందని దానికి అనుగుణంగా వ్యవసాయ యంత్ర పరికరాలకు ఎక్కువ డిమాండ్ ఉంటుందని ఆ విధంగా లబ్దిదారులకు వ్యవసాయ యంత్ర పరికరాలు. ఎంచుకొని అదేవిధంగా లబ్ది పొందాలని  తెలియలచేపినారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయి. అధికారి నారాయణ రావు ఎంపీపీ వజ్జా రమ్య, నేలకొండపల్లి ఎంపీడీవో జమలరెడ్డి,  మండల రైతు బంధు కన్వీనర్.శాఖమూరి సతీష్, సర్పంచ్ ఈవూరి సుజాత, తదితరులు పాల్గొన్నారు