జోడో యాత్రను విజయవంతం చేయండి
Published: Friday January 20, 2023
జన్నారం, జనవరి 19, ప్రజాపాలన: ఈ నెల 26 నుండి పీసీసీ అదేశాల మేరకు ఖానాపూర్ నియోజకవర్గంలో చేపట్టే హత్ సే హత్ జోడోయాత్రను విజయవంతం చేయాలని గురువారం పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెడ్మ బొజ్జుపటేల్, అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల కేంద్రంలోని జ్యోతి పంక్షన్ హల్ లో మండల కాంగ్రెస్ కార్యకర్తల సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం ఖానాపూర్ నియోజక వర్గంలోని జన్నారం మండలం రాంపూర్ గ్రామం నుండి జోడో యాత్రను ప్రారంభించే ఆలోచన ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంటింట తిరుగుతూ ప్రచారం చేసిన, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. ఈ సమావేశంలో ఉట్నూర్ జడ్పిటిసి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ మహిళ నాయకురాలు రాథోడ్ చారులత, జన్నారం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బోర్లకుంట ప్రభుదాస్, ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఫసిఉల్లా, మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యం రాజన్న, మండల కాంగ్రెస్ నాయకులు మామిడిపెల్లి ఇందయ్య, ఇమ్రాన్ , బినవేని రాజన్న, అంబటిపెల్లి మహేశ్, గంగన్నయాదవ్, తిరుపతి, దుమ్మల్ల రమేష్, హేమంత్ చారి , శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: