దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే శ్రీ రేగా
Published: Wednesday October 26, 2022
తన స్వగృహంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు సోమవారం నాడు దీపావళి వేడుకలను తన కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా నిర్వహించారు, దీపావళి సందర్భంగా ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు తన కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు తో కలిసి బాణాసంచి కాల్చారు. ఎప్పుడు ప్రజల్లో బిజీగా ఉండే రేగా కుటుంబ సభ్యులతో గడపడంతో వారిలో సంతోషాలు వెళ్లి విరిసాయి , ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నేతృత్వంలో ప్రజలు బంగారు మయం కావాలని, దేశంలోనూ సీఎం కేసీఆర్ ఉన్నత స్థానాలకు చేరుకోని అంత ఆనందమయం కావాలని వారు అన్నారు
ఈ కార్యక్రమంలో పినపాక మండలం ఎంపీపీ గుమ్మడి గాంధీ, బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు వట్టం రాంబాబు, ఆదివాసి ఉద్యోగుల సాంస్కృతిక మరియు సంక్షేమ సంఘం డివిజన్ అధ్యక్షులు పోలేబోయిన అనిల్ కుమార్, రాము, పడిగా అంజయ్య,పోలేబోయిన కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: