పచ్చదనం పరిశుభ్రతే లక్ష్యంగా పట్టణ ప్రగతి డిప్యూటీ మేయర్ శివ కుమార్ గౌడ్

Published: Monday July 05, 2021
మేడిపల్లి, జూలై 4 (ప్రజాపాలన ప్రతినిధి) : పచ్చదనం పరిశుభ్రతే లక్ష్యంగా పట్టణ ప్రగతి మహా యజ్ఞంలా ముందుకు సాగాలని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. కార్పొరేషన్ పరిధిలోని 7వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ మాడుగుల చంద్రకళ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేయర్ జక్క వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్ హాజరయ్యారు. పట్టణ ప్రగతిలో చేయవలసిన పనుల కార్యాచరణను ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డు ఇరుపక్కన మొలిచిన పిచ్చి మొక్కలను తొలగించడం, ఒపెన్ ప్లాట్స్ లో పేరుకున్న చెత్తను శుభ్రపరచడం, మురుగునీరు నిలవకుండా, దోమలను నివారించే విధంగా చూసుకోవాలని, డ్రైనేజీ సమస్యలను గుర్తించి శాశ్వత పరిష్కరించడం చేయడం, విద్యుత్, మంచినీటి వ్యవస్థను సరిచూసుకోవడం లాంటి అభివృద్ది పనులను చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కమిటీ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కాలనీల పెద్దలు తదితరులు పాల్గొన్నారు.