మెదడు వ్యాధి నియంత్రణకు చర్యలు చేపట్టాలి

Published: Friday December 16, 2022
* జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ
 వికారాబాద్ బ్యూరో 15 డిసెంబర్ ప్రజాపాలన : మెదడువాపు వ్యాధి నియంత్రణకు సంబంధిత శాఖల అధికారులు సహకరించి తొమ్మిది మాసాల నుండి 15 సంవత్సరాల పిల్లలకు జే ఈ వ్యాక్సినేషన్ వంద శాతం అయ్యేలా సహకరించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ కోరారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మెదడువాపు వ్యాధి నియంత్రణకు సంక్షేమ శాఖల అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, ఐసిడిఎస్ సూపర్వైజర్లు, సిడిపిఓలతో ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగినది.  ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ 9 నెలల నుండి 15 సంవత్సరాలలోపు పిల్లలందరికీ సంబంధిత శాఖల సహకారంతో జే ఈ వ్యాక్సినేషన్  వంద శాంతం పూర్తి చేసేందుకు యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని అన్నారు. అంగన్వాడి కేంద్రాలలో   1 నుండి 5 సంవత్సరాల పిల్లల వివరాలు, 6 సంవత్సరాల నుండి15 సంవత్సరాల పూర్తి వివరాలు వెంటనే అందజేయాలని కోరారు. ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు కుడి కాలుకు, 15 సంవత్సరాలలోపు పిల్లలకు కుడి చేతి రెట్టకు టీకాలు వేయబడతాయని తెలిపారు.  వ్యాక్సినేషన్ ద్వారా ఎలాంటి దుష్ప్రభావాలు లేవని, సురక్షితమైనదని తెలిపారు.  ప్రతిరోజు ఒక ఏఎన్ఎం 100 మంది పిల్లలకు టీకాలు వేసే విధంగా చూడాలన్నారు.  పిల్లల తల్లితండ్రులకు జె ఇ.వ్యాక్సిన్ పై అవగాహన కల్పించి ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ అయ్యేలా చర్యలు చేపట్టాలని అన్నారు.  విద్యా శాఖ, ఐసిడిఎస్ శాఖలు గ్రామ పంచాయతీల వారీగా తమ పరిధిలోని పాఠశాలలో అంగన్వాడి కేంద్రాలలో ఉన్న విద్యార్థుల వివరాలను వెంటనే అందజేసి వ్యాక్సినేషన్ కొరకు వైద్య శాఖకు సహకరించాలని కోరారు.  అన్ని మండల కేంద్రాలలో ఎంపీడీవోల ఆధ్వర్యంలో జేఈ వ్యాక్సినేషన్ పై అవగాహన కల్పించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప వైద్య అధికారి జీవరాజ్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కోటాజి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లలిత కుమారి, వైద్యశాఖ  స్టాటిస్టికల్ ఆఫీసర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.