వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం...
Published: Thursday December 09, 2021
ఎర్రుపాలెం డిసెంబర్ 8 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని తక్కెళ్ళపాడు, మొలుగుమాడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నందు డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, డీసీఓ విజయకుమారి, డీసీసీబీ డైరెక్టర్ అయిలూరి వెంకటేశ్వర రెడ్డితో కలిసి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఓ విజయకుమారి, మొలుగుమాడు సోసైటీ శెట్టిపల్లి మదన్ మోహన్ రెడ్డి, సర్పంచ్ కూరపాటి సుందరమ్మ, విద్యాసాగర్ రావు, యరమల విజయ్ భాస్కర్ రెడ్డి, శీలం వెంకట్ రెడ్డి, ఉప సర్పంచ్ అయిలూరి నాగిరెడ్డి, మీనవోలు సోసైటీ చైర్మన్ కుడుమల మధుసూదన్ రెడ్డి, ఏ ఓ విజయభాస్కర్ రెడ్డి, మండల రైతు సమన్వయ కన్వీనర్ శీలం వెంకట్రామిరెడ్డి, జిల్లా రైతుబందు కమిటీ సభ్యురాలు వేమిరెడ్డి త్రివేణి, సొసైటీ డైరెక్టర్లు తల్లపురెడ్డి ముక్కర వెంకట్రావమ్మ, భూపాల్ రెడ్డి, ఏఈ ఓ బాలకృష్ణ, కృష్ణకుమారి, ఎర్రుపాలెం డీసీసీబీ బ్యాంకు మేనజర్ వీరభద్రరావు, మొగిలి అప్పారావు, ప్రశాంత్, నారాయణ, సీఈఓ లు క్రిష్ణ, వీరారెడ్డి, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: