మునుగోడులో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే బిఆర్ఎస్ పార్టీ విజయానికి మూల కారణం. గ

Published: Tuesday November 08, 2022

బూర్గంపాడు ( ప్రజా పాలన.)

నిన్న మునుగోడు లో బిఆర్ఎస్ పార్టీ విజయం పట్ల బూర్గంపాడు మండలం బిఆర్ఎస్ పార్టీ  మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి హర్షం వ్యక్తం చేశారు.ఈ గెలుపునకు కారణం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ గెలుపుకు కారణమని ఇందులో భాగంగానే నల్గొండ జిల్లా మునుగోడు లో గతంలో ఉన్నటువంటి ఫ్లోరోసిస్ వ్యాధిని రూపుమాపిన  ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దని తెలంగాణ ప్రభుత్వానిదే అని గోపిరెడ్డి రమణారెడ్డి అన్నారు. అంతేకాకుండా రైతుబంధు ,మిషన్ భగీరథ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ,పథకాలు తెలంగాణకు శ్రీరామరక్ష అని ఈ పథకాలు దేశంలో ఎక్కడా లేవని అది కేవలం ఒక కేసీఆర్ కే సాధ్యమని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. బిజెపి పార్టీ యొక్క మత విద్వేషాలు వారి యొక్క 18 వేల కోట్ల కాంట్రాక్టు బిఆర్ఎస్ పార్టీ విజయం ముందు నిలవలేదని ఈ సందర్భంగా తెలియజేశారు. రాబోయే కాలంలో ప్రజలు రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా టీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తారని వారు అన్నారు.