ఘనంగా గణతంత్రం

Published: Friday January 28, 2022
హైటెక్ సిటీ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  ఆటల పోటీలు.
మంచిర్యాల బ్యూరో‌, జనవరి 27, ప్రజాపాలన : 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా హైటెక్ సిటీ వాకర్స్ అసోసియేషన్ ఆద్వర్యంలో బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హైటెక్ సిటీ కాలనీలో గల ఓపెన్ జిమ్ ప్లే గ్రౌండ్ లో హైటెక్ సిటీ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 15 రోజుల నుండి 35 రకాల ఆటల పోటీలు నిర్వహించారు. ఈ ఆటలలో విజేతలను గుర్తించి 200 మందికి బహుమతులు అందజేశారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాన్ని హైటెక్ సిటీ వాకర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు చిహెచ్ హనుమంతరావు అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమంలో 29వ వార్డు కౌన్సిలర్ కె చైతన్య సత్యపాల్ రెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షులు ఎర్రవెల్లి రఘునాథరావు, హైటెక్ సిటీ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గజెల్లివెంక టయ్య, ప్రధాన కార్యదర్శి మడుపు రామ్ ప్రకాష్, కోశాధికారి చెట్ల రామయ్య, ఉపాధ్యక్షులు బి శ్రీనివాస్ గౌడ్, కర్నాల శ్రీనివాస్, ముఖ్య సలహాదారులు తోట తిరుపతి, సత్యపాల్ రెడ్డి, సురభి రవికుమార్, పూరెల్ల పోచ మల్లు, బోడ రాజమౌళి, కనపర్తి దివాకర్, రావుల ప్రతాపరెడ్డి, పెద్దపల్లి పురుషోత్తం, గాజుల ప్రభాకర్, బూర్ల జ్ఞాని, మహిళా ఆర్గనైజర్లు శ్రీమతి రజిని, శ్రీమతి కీర్తి, నీలిమ, సుజాత, స్పోర్ట్స్ సెక్రెటరీ ఆట్టెం అశోక్ హేచ్ యం. పొట్ట మధుకర్, కే లక్ష్మణ్ మల్లికార్జున్, వి.నరోత్తం రావు, నాగరాజుఆర్టీసీ, ఒద్దుల రాజేందర్, నాగుల అంజయ్య, జంజీరాల శ్రీధర్, అలుగువెల్లి తిరుపతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.