*పోలీస్ నియామక అవకతవకల పై కాంగ్రెస్ పార్టీ నిరసన*
Published: Wednesday January 11, 2023
మంచిర్యాల టౌన్, జనవరి 10, ప్రజాపాలన: పోలీస్ ఉద్యోగుల నియామకం లో జరిగిన అవకతవకలను నిరసిస్తూ యువజన కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఐబీ చౌరస్తా లో నిరసన దీక్షను చేపట్టారు. ఈ దీక్షా శిబిరాన్ని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ,యువజన కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి సందర్శించి, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో లేని నిబంధనలను అమలులోకి తీసుకువచ్చి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు రాకుండా కుట్ర పన్నిందని ఆరోపించారు. ప్రభుత్వం తన తప్పిదాన్ని గుర్తించి ఉద్యోగాల నియామక పోటీల్లో పాల్గొన్న అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో యువజన కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తీవ్రం చేస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షుడు సళ్ళ మహేష్, పట్టణ అధ్యక్షులు షేర్ పవన్, నరిగే నరేష్, అంకతి శ్రీనివాస్, అధికార ప్రతినిధి నాయికిని సురేందర్, పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, పట్టణ కాంగ్రెస్ అద్యక్షుడు తూముల నరేష్, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: