ప్రయాణించే వారికి సహకారం అందించాలి ఐద్వా మహిళా సంఘం మండల అధ్యక్షురాలు పోతు విజయశంకర్
జన్నారం, నవంబర్ 06, ప్రజాపాలన: బస్సులలో ప్రయాణించి మహిళలకు వృద్ధులకు వికలాంగులకు వారికి కేటాయించిన సీట్లలో వారిని కూర్చునే విధంగా అందరూ సహకారం అందించాలని, ఆదివారం ఐద్వా సంఘం మండల అధ్యక్షురాలు పోతు విజయశంకర్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ బస్సులలో ఎక్కువగా నిరుపేద, మధ్య తరగతి ప్రజలే ప్రయాణం చేస్తూ ఉంటారని ఆమె తెలిపారు. ప్రభుత్వ ఆర్టీసీ బస్సులలో వయోవృద్ధులకు మహిళలకు దివ్యాంగులకు బస్సులలో కొన్ని సీట్లను కేటాయించడం జరిగిందని, కానీ ప్రయాణ సమయంలో వారికి కేటాయించిన సీట్లలో ఇతరులు కూర్చోవడంతో వారు ఇబ్బంది పడుతున్నారని, మానవత్వంతో వారికి చేయూత ఇవ్వాలన్నారు. బస్సులలో ముఖ్యంగా వృద్ధులు వికలాంగులు మహిళలు నిలబడి చాలా దూరం ప్రయాణించేటప్పుడు కష్టంగా ఉంటుందన్నారు. ఈ విషయాన్ని ఆర్టీసీ బస్సులో ప్రయాణించే సకలాంగులు గమనించి, వికలాంగులకు మహిళలు, వయోవృద్ధులు, వారికి కేటాయించిన సీట్లలో వారిని కూర్చొనివ్వాలని ఆమె కోరారు.
Share this on your social network: