బండి సంజయ్ యాత్ర ప్రజాసంకల్ప యాత్ర కాదది జనాన్ని ముంచే యాత్ర టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీ

Published: Monday August 29, 2022
 కరీంనగర్ ప్రజాతంత్ర ఆగస్టు 28 :
బీజేపీ ఎంపి బండి చేస్తున్న యాత్ర ప్రజాసంకల్ప యాత్ర కాదని, అది కేవలం కొన్ని వర్గాల్లో వైశామ్యాలు సృష్టించేదని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవి రామక్రిష్ణారావు విమర్శించారు. ఆదివారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో ఆయన మాట్లాడుతూ బండి సంజయ్ చేస్తున్న యాత్ర తెలంగాణాలో కాదని మోది ఉండే డిల్లీ లో చేయాలని జీవీరావు హితవు పలికారు. రెండు సార్లు యాత్ర చేసిన సాదించిందేమిటో ఎంపి బండి సంజయ్ కుమార్ ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే కోటి ఉద్యోగాలు ఇస్తామని  ప్రధాని మోడీ ఇచ్చిన హామీ ఎంత మేరకు అమలు చేశారో బండి గుర్తెరుగాలన్నారు.కవిత లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుందంటూ బండి సంజయ్ కుమార్ అవాకులు చెవాకులు పేలిస్తే  ఊరుకునేదీ లేదని ఆయన హెచ్చరించారు. అబద్దాల హామీలు చేస్తున్నది బీజేపీ యేనని బండి సంజయ్ గుర్తుపెట్చుకోవాలన్నారు.ఎంతో మంది త్యాగ దనుల పునాదులపై ఏర్పడిన తెలంగాణ రథసారథి  కేసీఆర్ పై బండి ఆరోపనులు చేస్తే ఖబడ్దార్ అని వీవీ ఆర్‌ హెచ్చరించారు. 

 ఈ సమావేశంలో వీరితోపాటు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి-హరిశంకర్, టిఆర్ఎస్వి జిల్లా కో-ఆర్డినటర్ పొన్నం అనిల్ గౌడ్, సుడా సభ్యులు చీటీ రాజేందర్ రావు, ఉదారపు మారుతి, నేతి రవివర్మ, తోట మధు, వంగర రవి, ఎంపిటిసి ద్యావ మధుసూదన్, మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు నారదాసు వసంత్ రావు, గందె కల్పన,ఇఫ్తేకర్, ఒడ్నాల రాజు, చోక్కారపు చంద్రం తదితరులు పాల్గోన్నారు. పాల్గొన్నారు.