ద్యాచారం గ్రామంలో రైతుబంధు వారోత్సవాలు

Published: Friday January 07, 2022
సర్పంచ్ ఎల్లనోల్ల అంజయ్య, ఎఈఓ పావని
వికారాబాద్ బ్యూరో 06 జనవరి ప్రజాపాలన : 232 మంది రైతులకు 32 లక్షల 71 వేల 5 వందల రూపాయలు రైతుల ఖాతాలో జమ అయ్యాయని ద్యాచారం సర్పంచ్ ఎల్లనోల్ల అంజయ్య, ఎఈఓ పావనిలు సంయుక్తంగా తెలిపారు. గురువారం వికారాబాద్ మండల పరిధిలోని ద్యాచారం గ్రామంలో రైతుబంధు వారోత్సవాలు, యాసంగి పంటల నమోదు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు పంట పెట్టుబడులకు ఇబ్బంది కలుగకుండా సిఎం కెసిఆర్ ముందు చూపు దార్శనికమని కొనియాడారు. యాసంగిలో వేసే పంటలను నమోదు చేసుకోవాలని సూచించారు. యాసంగిలో చనిగె, మక్కజొన్న, జొన్న తదితర పంటలను నమోదు చేయించుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పట్లోళ్ళ ప్రభులింగం, వడ్ల అనంతయ్య, చాకలి అంతయ్య, అల్లీపురం మైసయ్య, భీమేష్ తదితరులు పాల్గొన్నారు.