కమల్ రాజ్ గారు చేస్తున్న అభివృద్ధిని మీ జడ్పీటీసీలను అడిగి తెలుసుకోండి

Published: Monday February 08, 2021

మధిర నియోజకవర్గంలో అనేక  గ్రామాల్లో జడ్పీ నిధులతో అభివృద్ధి.*మధిర మండలం లోని అనేక గ్రామాల్లో సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు ఎల్ వో సి లు అందించిన ఘనత టిఆర్ఎస్ దే..*టిఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ నేతృత్వంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు సహకారంతో మధిర నియోజకవర్గంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తుంటే చూసి తట్టుకోలేని కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు పై అసత్య ఆరోపణలు చేయటం విడ్డూరంగా ఉందని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు విలేకర్ల సమావేశంలో ఖండించారు. టిఆర్ఎస్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో టిఆర్ఎస్  నాయకులు మాట్లాడుతూ మండల కాంగ్రెస్ అధ్యక్షులు సూరం శెట్టి కిషోర్ జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారిని విమర్శించే స్థాయి నీకుందా అని రావూరి శ్రీనివాస రావు పేర్కొన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇప్పటికే ప్రతి గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణం డబల్ బెడ్రూమ్ ఇల్లు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ రైతుబంధు రైతు బీమా పథకాలతో ప్రతి కుటుంబానికి ఒక సంక్షేమ పథకం అందే విధంగా టిఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. టిఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు ద్వారా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి తట్టుకోలేని కాంగ్రెస్ నాయకులు అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని వాస్తవం ఏమిటో ప్రజలకు తెలుసని ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని కాంగ్రెస్ నాయకులు మాట్లాడితే బాగుంటుందని టిఆర్ఎస్ నాయకులు హితవు పలికారు. ఈ విలేకరుల సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వర రావు ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు ఎంపీపీ లలిత, టిఆర్ఎస్ పట్టణ కార్యదర్శి అరిగె శ్రీనివాసరావు, మండల కార్యదర్శి బొగ్గుల భాస్కర్ రెడ్డి, టిఆర్ఎస్ పట్టణ బాధ్యులు కనుమూరి వెంకటేశ్వరరావు టిఆర్ఎస్ మున్సిపాలిటీ  ఫ్లోర్ లీడర్ అప్పారావు ప్రచార కార్యదర్శి పరస శీను వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.