అన్ని దానాల కంటేనేత్రదానం ఎంతో గొప్పది. వాసిరెడ్డి రామనాథం
మధిర అక్టోబర్ 16 (ప్రజా పాలన ప్రతినిధి) అన్ని దానాల కంటే నేత్రదానం ఎంతో గొప్పదని డాక్టర్ వాసిరెడ్డి రామనాథం పేర్కొన్నారు. స్వాతంత్ర సమరయోధులు వంకాయలపాటి కృష్ణమూర్తి మరణానంతరం, వారి నేత్రాలను దానంచేసి యిద్దరు అంధులకు చూపు వచ్చేందుకు సహకరించిన వారి కుటుంబ సభ్యులను అభినందిస్తూ ఆదివారం ఖమ్మం నేత్ర నిధి బాధ్యులు మాధవరపు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రసంసా పత్రము మరియు జ్ఞాపికలను డాక్టర్ వాసిరెడ్డి రామనాధం చేతులమీదుగా కృష్ణమూర్తి మనవడు అజయ్ కు అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేత్రదానంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ ప్రాంతంలో నేత్రదానం గురించి అవగాహన కల్పిస్తున్న మాధవరపు నాగేశ్వరావుని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో పుల్లఖండం చంద్రశేఖర్, చారుగుండ్ల నరసింహమూర్తి, మద్దినేని ప్రసాద్ టెక్నీషియన్ నాగేశ్వరరావు, వినుకొండ గురవయ్య, వంకాయలపాటి కృష్ణమూర్తి కుమార్తెలు, అల్లుడు గిరిధర్, బంధువులు పాల్గొన్నారు.
Share this on your social network: